తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంప‌తులు

తిరుమ‌ల శ్రీవారి స‌న్నిధిలో.. నాగచైతన్య, శోభిత దంప‌తులు

తిరుమల ఆగస్టు 21:

గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన శ్రీమ‌తి శోభితతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.తిరుమల శ్రీవారి దర్శనానికి సినీ ప్రముఖులు తరచూ ద‌ర్శించుకోవ‌డం తెలిసిన విష‌య‌మే. తాజాగా గురువారం ఉదయం హీరో నాగచైతన్య తన శ్రీమతి శోభిత తో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరి దర్శనానికి వచ్చిన సమాచారం తెలిసి అక్కడి భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వేదపండితులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇటీవలే తండేల్ విజ‌యంతో మంచి జోష్‌లో ఉన్న నాగచైతన్య వరుస చిత్రాలను లైన్‌లో పెట్టాడు. అయితే సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, విదేశీ టూర్ల‌కు వెలుతున్నారు. ఈక్ర‌మంలోనే శోభితతో కలిసి చైత‌న్య స్వామి వారి దర్శనానికి రాగా ఆ జంట‌ను చూసి భ‌క్తులు, అభిమానులు ముచ్చ‌ట ప‌డుతున్నారు

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!