
రక్త దాన శిబిరంలో పాల్గొన్న విజన్ ఇన్ఫ్రా ఎండీ కవిత



హైదరాబాద్ సిటి ఆగస్టు 20 (గోల్కొండ ): రక్త దాతలందరు మరొ ప్రాణానికి ప్రాణ దాతలవుతారని విజన్ ఇన్ఫ్రా ఎండీ చనగాని కవిత అన్నారు .బుధవారం బంజారాహిల్స్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి 70 వ జన్మదినం సందర్భంగా ఎర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో విజన్ ఇన్ఫ్రా కంపని సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు.ప్రతి వ్యక్తి రక్తదానం చేయలని పిలుపునిచ్చారు. కంపని కి సంబంధించిన దాదాపు 25 మంది సభ్యులు రక్త దానం చేశారు. చిరంజీవి మీద అభిమానంతో తము రక్త దాన శిబిరంలో పాల్గొన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రంమలో విజన్ ఇన్ఫ్రా ఎండీ చనగాని కవిత ,డైరెక్టరు లాయ్ బుద్ధా ,సి హిచ్ రామకృష్ణ ,డాకు ,రఘు ,రాజేష్ ,సతీశ్ ,ప్రవీణ్ ,నందిని ,సంతోష్ తదితరులు పాల్గొన్నరు.
TAGS Hot News


