
బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం…
హైదరాబాద్ ఆగస్టు 30 (గోల్కొండ ): తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా పరిమితి ఎత్తివేస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ కోసం ప్రత్యేక జీఓలు జారీ చేసేందుకు సిద్ధం అవుతుంది. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(A)ను సవరణ చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.గత కొంత కాలంగా బీసీ రిజర్వేషన్ పై కేంద్ర రాష్ట్రాల మధ్య పోరాటం కొనసాగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇవ్వడంతో స్థానిక ఎన్నికలకు ఇబ్బందిగా మారింది దింతో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది .
TAGS Hot News


