
యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు
వీణవంక, ఆగస్ట్ 30(గోల్కొండ)
మండలంలో రైతులకు యూరియా కోసం తిప్పలు తప్పడం లేదు.శనివారం రోజు మండల కేంద్రం లోని ఓ ప్రయివేటు ఎరువుల దుకాణం వద్ద కు రెండు వందల యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారం తో తెల్లవారుమునుండే రైతులు క్యూ లైన్ కట్టారు.వర్షాలు సమృద్ధిగా పడడంతో పూర్తి స్థాయిలో పంటలు వేశారు.దింతో యూరియా వినియోగం పెరగడం కావలిసిన యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు ఎత్తివేయడంతో రైతులు పనులు మానుకొని యూరియా కోసం వేచి చుడాలిసివస్తుంది . ఇది ఇలా ఉంటే ఒక్క ఆధార్ కు రెండు యూరియా ఇస్తూ పొటాష్ లింక్ పెట్టాడు. రైతుల అవసరాన్ని వ్యాపారి తనకు అనుకూలంగా మార్చుకొని ఇతర మందులు అమ్ముతున్నారు.
TAGS Hot News


