
మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారు.. షర్మిల సెటైర్లు
అమరావతి ఏప్రిల్ 09 (గోల్కొండ ):
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా జగన్ మారారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో మూడు రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు ‘మావిగన్ జోకర్’గా జగన్ మిగిలారని సెటైర్లు గుప్పించారు. సంక్షేమానికి సారథి దివంగత నేత వైఎస్సార్ అని కొనియాడారు. ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం, కన్నీళ్ల నుంచి పుట్టిందేనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో షర్మిల ట్వీట్ పెట్టారు
TAGS Hot News


