
గంగాధర తహశీల్దార్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు..
గంగాధర అక్టోబర్ 02 (గోల్కొండ)
గంగాధర మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో గురువారం గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ…గాంధీ చెప్పిన సిద్ధాంతం సత్యం, అహింస ద్వారా మన హక్కులను పొందే మార్గని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ అని కొనియాడారు. అనంతరం గాంధీ సేవలను వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గిర్ధవార్లు రజనీకాంత్ రెడ్డి, సంతోష్ కుమార్, రెవెన్యూ సిబ్బంది, అనిల్, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
TAGS Hot News


