
ఘనంగా విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి లో అన్నదానం
గణపతి వద్ద ప్రత్యేక పూజలు చేసిన మియాపురం లక్ష్మణ్ దంపతులు
మంచిర్యాల (గోల్కొండ): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టూ టౌన్ ప్రాథమిక అమాలివాడలో శనివారం విశ్వబ్రాహ్మణ గణేష్ మండలి వద్ద మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందర మియాపురం భాగ్యలక్ష్మి లక్ష్మణ్ గణపతి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం 300 మందికి అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయబడ్డారు. టూ టౌన్ ప్రాంతమంతా సుభిక్షంగా ఉండాలని, అన్ని కులాల వారు సంతోషంగా విఘ్నేశ్వరుని కృపకు పాత్రులు కావాలని లక్ష్మణ్ కోరారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ముదిరాజ్ రాష్ట్ర మహాసభ కార్యదర్శి దబ్బేట తిరుపతి, అనిల్, సతీష్, గంప నాగేందర్, కాజల్ సతీష్, ఎర్రం ప్రభాకర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

TAGS Mancherial


