
మాజీ మార్కెట్ డైరెక్టర్ కొమురయ్య ను పరామర్శించిన బీఆర్ ఎస్ నాయకులు
కరీంనగర్ ఆగస్టు 10 (గోల్కొండ ప్రతినిధి) : కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మారాముల్లా కొమురయ్య తండ్రి చంద్రయ్య ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని కేడీసీసీ బ్యాంకు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పింగిళి రమేష్ పరామర్శించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు .వీరి వెంట నాయకులు రాపర్తి అఖిల్ గౌడ్ ,ఎగిత అశోక్ ,రాజేశ్వర్ రావ్ శ్రీనివాస్ ,చిరంజీవి ,రాకేష్ తదితరులున్నారు .


