నూతన కమిటీ నియామకం

నూతన కమిటీ నియామకం

హైదరాబాద్ సిటీ ఆగస్టు 10 (గోల్కొండ ) హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజిక వర్గం కొత్తపేట డివిజన్ మోహన్ నగర్ లోని ప్రజయ్ నివాస్ ఫేజ్ 2 , 6వ బ్లాక్ నివాసితులు నూతన కమిటీని ఆదివారం ఉదయం 8గంటలకు ఎన్నుకున్నారు .బ్లాక్ నూతన అధ్యక్షునిగా రెడ్డిపల్లి నర్సింహా ,ఉపాధ్యక్షులుగా ఎర్ర శ్రావణ్ రాజ్ ,శ్రీనివాస్ రావు ,కార్యదర్శిగా ఆవునూరి శ్రీనివాస్ ,కల్చరర్ సెక్రటరీ గా, జి సత్యనారాయణ ,ముఖ్య సలహాదారునిగా ఎస్ శ్రీనివాస్ ,ట్రెజరర్ గా భాస్కర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు .నూతన కమిటీని పలువురు అభినందించారు.నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ బ్లాక్ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఓనర్స్,టెనెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

CATEGORIES
TAGS
Share This

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!